
Play all audios:
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసులో సీఎం ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. సిరిసిల్ల: సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) క్యాంపు
కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసులో సీఎం ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ప్రొటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. వారిని భారాస నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల
నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇరువర్గాల తోపులాటతో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ వేలికి గాయమైంది. (Telangana News)