All party delegations: ఉగ్రవాదంపై పోరు.. భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌

feature-image

Play all audios:

Loading...

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE), జపాన్‌కు వెళ్లిన అఖిలపక్ష బృందాలు.. పాక్‌ దుశ్చర్యలు, భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ఆయా దేశాల నాయకులకు వివరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇంటర్నెట్‌


డెస్క్‌: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌, దానిని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను మన ప్రభుత్వం విదేశాలకు పంపించిన విషయం


తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE), జపాన్‌కు వెళ్లిన బృందాలు.. పాక్‌ దుశ్చర్యలు, భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)పై ఆయా దేశాల నాయకులకు వివరించే


పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో వారి నుంచి భారత్‌కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడున్న మన రాయబార కార్యాలయాలు వెల్లడిస్తున్నాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్‌ శిందే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం


యూఏఈలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో అక్కడి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రముఖులు, మేధావులతో భేటీ అవుతోంది. ఇప్పటికే రెండు కీలక సమావేశాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా పాక్‌ నుంచి ఎదురవుతున్న ఉగ్ర


ముప్పు, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి చర్యలను వారికి మన బృందం వివరించింది. ఈ క్రమంలో భారత్‌ చేపట్టిన దౌత్యపరమైన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిన యూఏఈ అధికారులు.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా


రూపుమాపాల్సిందేనని ఉద్ఘాటించారు. * అమెరికా.. అమెరికాలోనే ఉంది.. ట్రంప్‌ను ‘కాల్‌’ పెట్టనివ్వలేదు: జైశంకర్ క్లారిటీ జేడీయూ ఎంపీ సంజయ్‌ ఝా సారథ్యంలో జపాన్‌లో పర్యటిస్తోన్న అఖిల పక్ష బృందం కూడా


అక్కడి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. జపాన్‌ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత్‌ తీసుకున్న చర్యలను ప్రశంసించారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వారిని


శిక్షించాల్సిందేనన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా జపాన్‌ నిలుస్తుందని భరోసా ఇచ్చారు.