Nagarjuna: నాగార్జున జోరు.. ఆ స్టార్‌ హీరోతో మరోసారి?

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన్మథుడిగా క్లాస్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకోగలరు.. యాక్షన్‌తోనూ అదరగొట్టగలరు టాలీవుడ్‌ హీరో నాగార్జున (Nagarjuna). ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్ మీదున్నారు. భాషతో సంబంధం


లేకుండా స్టార్‌ హీరోల సినిమాల్లో భిన్నమైన పాత్రలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు మరో సినిమాలో విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘కుబేర’లో ఈడీ అధికారి.. కోలీవుడ్‌ హీరో


ధనుష్‌ (Dhanush) ప్రధాన పాత్రలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. ఇందులో నాగార్జున.. ఈడీ అధికారిగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఆయన లుక్స్‌ ఆకట్టుకున్నాయి. ధనుష్‌


సరసన రష్మిక (Rashmika) నటించిన ఈ పాన్‌ ఇండియా మూవీ జూన్‌ 20న విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున నటించడంపై ధనుష్‌ ఆనందం వ్యక్తం చేశారు. నాగ్ చాలా మంచి వ్యక్తి అని.. ఆయనతో నటించడం ఎప్పటికీ


మర్చిపోలేనని అన్నారు. * సాంకేతికతపై పవన్‌ కల్యాణ్‌కు పట్టుంది: నిర్మాత ఏఎం రత్నం ‘కూలీ’లో సైమన్‌.. రజనీకాంత్‌తో (Rajinikanth) కలిసి ‘కూలీ’తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు నాగార్జున. లోకేశ్‌


కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున.. సైమన్‌ అనే పాత్రలో సందడి చేయనున్నారు. ‘ఖైదీ’ నుంచే లోకేశ్‌తో కలిసి పని చేయాలనుందని, ‘కూలీ’తో అది నెరవేరిందని నాగార్జున ఓ సందర్భంలో


తెలిపారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్‌తో రెండోసారి! కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జైలర్‌ 2’ (jailer 2). నెల్సన్‌


దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ నటించే అవకాశాలున్నాయని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో


నాగార్జున కనిపించనున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. ‘కూలీ’లో.. హీరోకు దీటైన పాత్ర పోషించిన నాగార్జున అయితేనే ‘జైలర్‌ 2’లో నెగెటివ్‌ రోల్‌కు సెట్‌ అవుతారని భావించారట డైరెక్టర్‌


నెల్సన్‌. ‘జైలర్‌ 2’లో విద్యా బాలన్‌! ‘జైలర్‌ 2’ విషయంలో మరో రూమర్‌ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ ఓ కీ రోల్‌కి ఎంపికయ్యారట. అయితే, వీటిపై చిత్ర బృందం స్పందించలేదు.