
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పూంఛ్ ప్రాంతంలో పర్యటించారు. ఇటీవల భారత్-పాకిస్థాన్ల మధ్య ఘర్షణ నేపథ్యంలో దాయాది చర్యలకు
జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. పాక్ దాడుల కారణంగా పూంఛ్ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గృహాలు దెబ్బతిన్నాయి. ఈక్రమంలోనే
బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు రాహుల్ శనివారం అక్కడ పర్యటించారు. పూంఛ్లోని బాధితులను కలిసి వారి నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ
ప్రాంతంలోని ఒక పాఠశాలకు రాహుల్ వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. తన పర్యటనకు సంబంధించిన వీడియోను రాహుల్ ఎక్స్లో పోస్టు చేశారు. ఇక, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం
రాహుల్ జమ్మూకశ్మీర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడి బాధితులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. * ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే భారత్ మౌనంగా ఉండదు: శశిథరూర్ రాహుల్కు నాన్ బెయిలబుల్
వారెంట్.. ఝార్ఖండ్లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టు రాహుల్గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పుడు భాజపా అధ్యక్షుడిగా ఉన్న అమిత్
షాపై రాహుల్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భాజపా నేత ప్రతాప్ కటియార్ ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై తాజాగా కోర్టు విచారణ జరిపింది. వ్యక్తిగత హాజరు నుంచి
మినహాయింపు ఇవ్వాలంటూ రాహుల్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. జూన్ 26న వ్యక్తిగతంగా హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.