Ghattamaneni jayakrishna: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో..?

feature-image

Play all audios:

Loading...

హైదరాబాద్‌: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు ఇండస్ట్రీలోకి రానున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌ బాబు సోదరుడు, నటుడు రమేశ్‌ బాబు (Ramesh Babu) తనయుడు


జయకృష్ణ (Jayakrishna) ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే అతడు హీరోగా కొత్త సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ దర్శకుడు అజయ్‌ భూపతి ఈ చిత్రానికి


దర్శకత్వం వహించనున్నారని టాక్‌. వైజయంతి మూవీస్‌, ఆనంద్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ నిర్మించే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి జయకృష్ణ ఇప్పటికే


ఫొటోషూట్‌లో పాల్గొన్నారట. యాక్టింగ్‌ సహా పలు అంశాలపై ఆయన శిక్షణ తీసుకున్నారని సమాచారం. * ఈ వారం థియేటర్‌లో వినోదాలను పంచే చిత్రాలివే! రమేశ్‌బాబు 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.


‘అల్లూరి సీతారామరాజు’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో బాలనటుడిగా నటించి తండ్రి వారసత్వాన్ని చాటారు. ‘నా ఇల్లే నా స్వర్గం’, ‘అన్నా చెల్లెలు’, ‘పచ్చతోరణం’, ‘ముగ్గురు


కొడుకులు’, ‘సామ్రాట్‌’, ‘చిన్ని కృష్ణుడు’, ‘కృష్ణగారి అబ్బాయి’, ‘బజార్‌ రౌడీ’, ‘కలియుగ కర్ణుడు’, ‘బ్లాక్‌ టైగర్‌’, ‘కలియుగ అభిమన్యుడు’ ఇలా మొత్తం 17 చిత్రాల్లో నటించారు. తన సోదరుడు


మహేశ్‌బాబు నటించిన ‘అతిథి’, ‘అర్జున్‌’ చిత్రాలను నిర్మించారు. అనారోగ్యంతో 2022లో రమేశ్‌బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే.