Sc: ఆమె ఉగ్రవాదా లేక హంతకురాలా..? పూజా ఖేడ్కర్‌ కేసులో సుప్రీం ప్రశ్న

feature-image

Play all audios:

Loading...

దిల్లీ: అధికార దుర్వినియోగం, తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ వ్యవహారంలో ఆ మధ్య ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌ (Puja Khedkar)కు సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించింది.


బుధవారం అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు


చేసింది. ఆమె చేసిన తీవ్రమైన నేరం ఏమిటని పోలీసులను ప్రశ్నించింది.  ‘ఆమె డ్రగ్ లార్డ్.. ఉగ్రవాది కాదు. ఎటువంటి హత్యా చేయలేదు. కేసు తీవ్రతను పరిశీలిస్తే కేసు వాస్తవాలను, పరిస్థితులను


దృష్టిలోపెట్టుకొని..పిటిషనర్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుచేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె అన్నీ కోల్పోయింది. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం లేదు. ఈ కేసుపై దర్యాప్తును త్వరగా


పూర్తిచేయండి. విచారణకు సహకరించేలా ఆమెను ఆదేశిస్తాం’’ అని పేర్కొంది. కాగా అత్యున్నత న్యాయస్థానం ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్ మంజూరుచేయడాన్ని దిల్లీ పోలీసుల తరపు న్యాయవాది తీవ్రంగా


వ్యతిరేకించారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి.. దర్యాప్తునకు కూడా ఖేడ్కర్‌ సహకరించట్లేదని కోర్టుకు విన్నవించారు.  * ఇలాంటి పబ్లిసిటీ ఎందుకు..?: ప్రొఫెసర్‌ ఆపరేషన్ సిందూర్ పోస్ట్‌పై


సుప్రీం పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి


తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ (UPSC).. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్‌ చేసినట్లు


గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ పత్రాలను


ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటు వేసే అధికారం లేదని వాదించినప్పటికీ.. ఆమెకు నిరాశే ఎదురైంది. గతేడాది ఆగస్టులో ఆమె ముందస్తు బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం


ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.