Mohan babu: ‘మీ మూవీలో విలన్‌గా చేస్తా’ మోహన్‌బాబు రిక్వెస్ట్‌.. శివరాజ్‌కుమార్‌ ఆఫర్‌ ఇదే

feature-image

Play all audios:

Loading...

బెంగళూరు: ‘కన్నప్ప’ (Kannappa) మూవీలో శివుడిగా చేయమని తొలుత శివరాజ్‌కుమార్‌ను (Shiva Rajkumar) అడిగామని.. అయితే, డేట్స్‌ కుదరకపోవడం వల్ల ఆయన నటించలేకపోయారని నటుడు, నిర్మాత మోహన్‌బాబు (Mohan


Babu) అన్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్‌ మూవీ ‘కన్నప్ప’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల (kannappa


release date) ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా టీమ్‌ బెంగళూరు వెళ్లింది. కన్నడ సినిమాలో నటించాలని కోరిక ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘‘కన్నడ


రాష్ట్రమన్నా, ఇక్కడి ప్రజలన్నా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ గారే. అటువంటి గొప్ప వ్యక్తి ఆశీస్సులు మాకు, నా బిడ్డకు కావాలి. ఆయన నటన గురించి మాట్లాడటానికి మేము సరిపోము. ఆ తర్వాత


ఇక్కడ మాకు అత్యంత ఆత్మీయుడు అంబరీష్‌. అతడు చనిపోయిన తర్వాత ఇక్కడికి రావడానికి సంశయిస్తూ ఉండేవాడిని. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మనమంతా దేవుడు నడిపించే బొమ్మలం. రాత్రి పడుకుంటే ఉదయం లేస్తామో


లేదో తెలియదు. సినిమా జయాపజయాలు మన చేతుల్లో లేవు. నిజాయతీ, నిబద్ధతతో కష్టపడ్డామా? శ్రద్ధతో పనిచేశామా? అన్నదే ముఖ్యం. ఏదైనా కన్నడ సినిమాలో నటిస్తే బాగుండేదని అని అనిపిస్తూ ఉండేది. అంబరీష్‌ను


అడిగితే, నవ్వి ఊరుకునేవాడు. అప్పట్లో రాజ్‌కుమార్‌గారిని అడగాలంటే ధైర్యం సరిపోలేదు. ఆయన తనయుడు శివరాజ్‌కుమార్‌ను మాత్రం ఒక కోరిక కోరుతున్నా. ఆయన నటించే తర్వాతి చిత్రంలో విలన్‌గా అవకాశం


ఇవ్వాలని అడుగుతున్నా’’ ఇదంతా భగవత్‌ సంకల్పం ‘‘రాజ్‌కుమార్‌ గారు ‘శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ తీశారు. సెన్సేషనల్‌ హిట్‌. నేను చాలా సార్లు చూశా. తెలుగులో తీయాలన్న ఆలోచన నాకు రాలేదు.  తెలుగులో


కృష్ణంరాజు చేసేశారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మేము తెలుగులో తీస్తున్నాం. ఇదంతా భగవత్‌ సంకల్పం. ఏడెనిమిదేళ్ల పాటు విష్ణు ఈ కథతో ప్రయాణం చేశాడు. ధూర్జటి మహాకవి రాసిన పద్యాలను తీసుకుని


వాటిని అర్థం చేసుకుని కథను సిద్ధం చేశారు. నాటి కాళహస్తి పరిసరాలను రీక్రియేట్‌ చేయడానికి న్యూజిలాండ్‌ వెళ్లాం. సినిమా మేము తీశామంతే. యత్నం.. ప్రయత్నం.. దైవయత్నం.. ఆ దైవం ఆశీస్సులు కావాలి.


అలాగే కన్నడ ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’’ అని మోహన్‌బాబు అన్నారు.  విష్ణుపై గౌరవం పెరిగింది అనంతరం శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ జనరేషన్‌లో ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే


అందరికీ తెలిసిన కథను తీయడంలో రిస్క్‌ ఉంటుంది. కానీ, మూవీ విజువల్స్‌ చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయి. ఈ జనరేషన్‌ మైథాలజీ, భక్తి చిత్రాలను కూడా ఆదరిస్తున్నారు. నాన్నతో కలిసి మూడు సినిమాలు చేశా.


అన్నీ సూపర్‌ హిట్‌. ఆయనతో కలిసి ‘శివ మెచ్చిద కన్నప్ప’ (1988)లో నటించాలంటే మొదట భయం వేసింది. ఆ తర్వాత ఆ పాత్రపై నాకు ఇష్టం ఏర్పడింది. ముఖ్యంగా ‘నేనిల్ల నేనిల్ల’ పాట చేస్తున్నప్పుడు మరింత


ఆసక్తి ఏర్పడింది. 37ఏళ్ల తర్వాత అదే కథతో విష్ణు సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’’ మోహన్‌బాబుకు హై క్వాలిటీ రోల్‌ ఇస్తా ‘‘మోహన్‌బాబులాంటి గొప్ప నటుడు, నిర్మాత ఈ


కథకు ఓకే చెప్పడం నిజంగా అభినందనీయం. శ్రీకాళహస్తికి అందరూ వెళ్తారు. కానీ, ఓ కొత్త ప్రపంచాన్ని చూపించడానికి టీమ్‌ న్యూజిలాండ్‌ వెళ్లింది. నిజంగా అమేజింగ్‌. ఈ మూవీ 100శాతం సూపర్‌ డూపర్‌ హిట్


అవుతుంది. నేను కూడా ఈ మూవీలో నటించాల్సింది. కానీ, డేట్స్‌ కుదరలేదు. ఈసారి విష్ణు ఏం అడిగినా చేస్తా. మోహన్‌బాబుగారు రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడారు. అది నాకు సమస్యే కాదు. ఆయన ఇచ్చినా


ఇవ్వకపోయినా చేస్తా. మేమంతా ఒకటే కుటుంబం. అలాగే నా సినిమాలో విలన్‌ పాత్ర చేయాలని, ఆయన అడిగారు. కానీ, ఆ పాత్ర ఇవ్వను. వేరే పాత్ర ఉంది. ఒక అందమైన అన్నయ్య పాత్ర ఉంది. హై క్వాలిటీ రోల్‌ అది. నేను


ఆయనతో ఫైట్‌ చేయాలనుకోవడం లేదు. జూన్‌ 27న నేను టికెట్‌ కొని మరీ మూవీ చూస్తా. మీరందరు కూడా మూవీ చూడండి’’ అని శివరాజ్‌కుమార్‌ అన్నారు.