Manchu manoj: నాన్న కాళ్లు పట్టుకోవాలని ఉంది.. కానీ: మంచు మనోజ్‌

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన తండ్రి మోహన్‌బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన కుమార్తెను ఆయన ఒడిలో పెట్టాలనుందని నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) అన్నారు. తమ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల


గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. * థియేటర్ల బంద్‌ నిర్ణయం వెనుకున్నదెవరు?: విచారణకు మంత్రి దుర్గేశ్‌ ఆదేశం ‘‘9 ఏళ్లుగా నా పని నేను చేసుకుంటున్నా. నా భార్య బొమ్మల కంపెనీ ప్రారంభించింది.


దానికి నేను ఆర్ట్‌ వర్క్‌ చేశా. కథలు రాశా. ఆత్మగౌరవంతో బతికాం. నేను ఎలాంటి వాడినో చాలా మందికి తెలుసు. ఊహించని విధంగా ముప్పు ఎదురైంది. నిస్సహాయ స్థితిలో ఉన్న కారణంగా మీడియా ముందుకొచ్చా. నా


సతీమణి ప్రెగ్నెన్సీ సమయంలో మేమంతా మళ్లీ కలిశాం. అది మా కుటుంబంలో ఒకరికి నచ్చలేదు. మరోవైపు, కాలేజీలోని కొన్ని సమస్యల గురించి పెద్దాయన వరకూ వెళ్లడం లేదంటూ విద్యార్థులు లెటర్స్‌ రాసి నాకు


ఇచ్చారు. ‘నీకేంటి సంబంధం?’ అన్న మాట అప్పుడొచ్చింది’’ ‘‘అక్కడ పనిచేసే వారందరితో నాపైనా, నా భార్యపైనా కేసులు పెట్టించారు. సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నా హృదయం ముక్కలైంది.


తనకు అన్నీ నేనే. నేను తప్పు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. గొడవ పెట్టుకోలేదు. నాకూ ఆవేశం ఉంది. బాధతో వచ్చిన కోపం అది. వెళ్లి నాన్న కాళ్లు పట్టుకోవాలని, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని


ఇప్పటికీ ఉంది. కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే..? నా పిల్లలకు నేనేం నేర్పిస్తా. మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని


ప్రార్థిస్తున్నా. సమస్యలు సృష్టించిన వారు తమ తప్పుని తెలుసుకుంటారనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు మనోజ్‌. ఆయన, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌,


నారా రోహిత్‌ కలిసి నటించిన చిత్రమిది. విజయ్‌ కనకమేడల దర్శకుడు. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది.