
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine Conflict) మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. వాటి వల్ల ఫలితం లేకపోవడంతో తాజాగా మరోసారి ప్రత్యక్ష
చర్చల కోసం రష్యా (Russia) ప్రతిపాదనలు చేసింది. ఒకవైపు శాంతి ఒప్పందానికి సన్నద్ధం అవుతున్నప్పటికీ మరోవైపు ఇరుదేశాలు దాడులు కొనసాగిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము
వరకు మాస్కో.. కీవ్పై దాదాపు వందకు పైగా డ్రోన్లు, ఐదు క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. వాటిలో 42డ్రోన్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని తెలిపింది. జపోరిజ్జియా
ప్రాంతంలోని ఫ్రంట్-లైన్ గ్రామం డోలింకాపై జరిగిన దాడిలో 9ఏళ్ల చిన్నారి మృతి చెందగా ..భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు జపోరిజ్జియా గవర్నర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. పలువురు గాయపడ్డారన్నారు.
దీంతో కీవ్ సైతం మాస్కోపై ప్రతీకార దాడులు చేసింది. రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడుల్లో 14మంది గాయపడ్డారని..పలు భవనాలు ధ్వంసమయ్యాయని రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
శుక్రవారం ఉక్రెయిన్ ప్రభుత్వ సలహాదారు ఆండ్రీ యెర్మాక్ మాట్లాడుతూ.. సోమవారం ఇస్తాంబుల్లో రష్యాతో ప్రత్యక్ష శాంతి చర్చలను తిరిగి ప్రారంభించడానికి కీవ్ సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే చర్చల
ప్రారంభానికి ముందు యుద్ధం ముగింపుపై తన వైఖరిని తెలుపుతూ.. వాగ్దానం చేసిన మెమోరాండాన్ని రష్యా తమకు అందించాలని షరతు పెట్టారు. * పుతిన్ కోసం కిమ్.. 9లక్షల ఫిరంగి గుండ్లు.. 100 బాలిస్టిక్
క్షిపణులు.. 14వేల సైన్యం! రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 19న ట్రంప్, పుతిన్ ఫోన్ కాల్లో దాదాపు రెండు
గంటలకుపైనే మాట్లాడుకున్నారు. అనంతరం పుతిన్ స్పందిస్తూ భవిష్యత్తు శాంతి ఒప్పందానికి సంబంధించి ఉక్రెయిన్తో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మరో వైపు ఉక్రెయిన్తో పోరాడడానికి
ఇప్పటికే వేలమంది సైన్యాన్ని, ఆయుధాలను మాస్కోకు పంపిన ఉత్తర కొరియా తాజాగా మరో 14 వేల మంది సైన్యం, 9లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి, 100 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు రష్యాకు
పంపినట్లు సమాచారం. దీంతో యుద్ధం ముగింపుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.