Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. రాణించిన ఎల్‌ఐసీ షేర్లు

feature-image

Play all audios:

Loading...

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ.. బ్లాక్‌డీల్స్‌, ప్రైమరీ మార్కెట్‌లో పెరిగిన


యాక్టివిటీ మూలంగా నిధులు తరలివెళ్లాయి. దీంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. రోజంతా ఓ మోస్తరు స్థాయిలో కదలాడి చివరికి నష్టాల్లో స్థిరపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని


ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,457.61 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,551.63) ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,244.02 - 81,613.36 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 239 పాయింట్ల


నష్టంతో 81,312.32 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 73.75 పాయింట్ల నష్టంతో 24,752.45 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం 85.37గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే


ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు


లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 64.61 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3,317 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. * ఎల్‌ఐసీ షేర్లు పైకి: ఎల్‌ఐసీ షేర్లు నేడు


దూసుకెళ్లాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.19,013 కోట్ల నికర లాభాన్ని (38 శాతం) కంపెనీ నమోదు చేసిన నేపథ్యంలో కంపెనీ షేర్లు ఉదయం 9 శాతం మేర లాభడ్డాయి. చివరికి బీఎస్‌ఈలో రూ.69.30 లాభంతో


(7.96 శాతం) రూ.940 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో రూ.69.50 (7.98 శాతం) లాభంతో రూ.940.75 వద్ద స్థిరపడ్డాయి. * ఐటీసీ షేర్లు పతనం: ఐటీసీలో బ్రిటీష్‌ మల్టీనేషనల్‌ బీఏటీ పీఎల్‌సీ 2.3 శాతం మేర తన


వాటాలను బ్లాక్‌ డీల్‌ ద్వారా విక్రయించిన నేపథ్యంలో కంపెనీ షేర్లు పతనం అయ్యాయి. ఆరంభంలో 5 శాతం మేర క్షీణించాయి. చివరికి ఎన్‌ఎస్‌ఈలో 2.97 శాతం నష్టంతో రూ.421 వద్ద ముగిశాయి.