Ms dhoni: ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ అప్పుడే

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నేళ్లుగా ఐపీఎల్‌ (IPL) సీజన్‌ ప్రారంభమైన ప్రతిసారీ ధోనీ (MS Dhoni) రిటైర్మెంట్‌పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గత సీజన్‌లో ధోనీ మోకాలి సమస్యతో ఇబ్బంది


పడ్డాడు. శస్ర్తచికిత్స తర్వాత కోలుకుని తిరిగి ఈ సీజన్‌ ఆడుతున్నాడు. అయిదుసార్లు ఐపీఎల్‌ టోర్నీ విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) జట్టు, ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో


తేలిపోతోంది. వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌నకు చేరుకోకపోవడం చెన్నైకి ఇదే ప్రథమం. మొత్తంగా వారి 16 ఏళ్ల చరిత్రలో వారు ప్లేఆఫ్స్‌నకు దూరమవడం ఇది మూడోసారి మాత్రమే. ప్రస్తుత సీజన్‌లో చెన్నై


ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడితే అందులో కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. 10 మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో 6 పాయింట్లతో పట్టికలో పదోస్థానానికి పరిమితమైంది. తాజాగా మే 20న దిల్లీలోని


అరుణ్‌ జైట్లీ మైదానం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మే 25న అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఈ సీజన్‌లో


చెన్నైకు ఇదే ఆఖరి మ్యాచ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌పై పలువురు విమర్శలు చేస్తున్నారు.  విశ్రాంతికి వేళైంది: జోగిందర్‌ శర్మ మహింద్ర సింగ్‌ ఫిట్‌నెస్ స్థాయిని పరిగణనలోకి


తీసుకుంటే, అతను దాన్ని నిరూపించుకోవడానికి ఆడాలి. కానీ ఇప్పుడు ధోనీ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నమ్ముతున్నాను.   నేనే ధోనీనైతే ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించి ఉండేవాణ్ని: సంజయ్‌


బంగర్‌ నేనే ధోనీనైతే ఈ పాటికే ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించి ఉండేవాణ్ని. జట్టులో మార్పు అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కాబట్టి రిటైర్‌మెంట్‌ తీసుకోవడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదు.


తాను నిష్క్రమించినా ఫ్రాంఛైజీ అభివృద్ధి అదే జరుగుతుందన్న వాస్తవాన్ని అతను ఇప్పటికైనా గ్రహించాలి. ధోనీనే నిర్ణయం తీసుకోవాలి: కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఐపీఎల్‌లో కొనసాగాలా.. లేదా రిటైర్మెంట్‌


తీసుకోవాలా... అనే నిర్ణయం తన శారీరక స్థితి ఆధారంగా అతనే తీసుకోవాలి. కానీ ఈ వయసులోనూ కొనసాగడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది.  ఏ


విషయమో నా శరీరమే చెబుతుంది: మహేంద్ర సింగ్‌ ధోనీ నేను వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడాలా.. లేదా.. అనే విషయం నా శరీరమే నాకు చెబుతుంది. దాని ఆధారంగానే నేను నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌


ముగిసిన తర్వాత నా చేతిలో 6 నుంచి 8 నెలల సమయం ఉంటుంది. అప్పుడు నా శరీరం ఎలా స్పందిస్తుందో చూస్తా. ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది అనుకుంటే కొనసాగుతా.  ధోనీ ఐపీఎల్‌లో 2008లో అరంగేట్రం చేశాడు.


ఇప్పటి వరకు 277 మ్యాచులు ఆడి 5,439 పరుగులు (242 ఇన్నింగ్స్‌ల్లో) చేశాడు. ధోనీ వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ 84*. ఇప్పటి వరకు 24 అర్ధశతకాలు చేశాడు. 375 ఫోర్లు, 264 సిక్స్‌లు బాదాడు. ఇక ప్రస్తుత


సీజన్‌ విషయానికొస్తే.. 13 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 135.17 స్ట్రైక్‌ రేట్‌తో 196 పరుగులు మాత్రమే చేశాడు. కీపింగ్‌లో మాత్రం కుర్రాళ్లతో పోటీపడుతూ కొన్ని మెరుపు స్టంపింగ్‌లు చేశాడు.