Cji justice br gavai: సెలవుల్లో పనిచేయడానికి లాయర్లు ఇష్టపడటం లేదు: సీజేఐ జస్టిస్‌ బీఆర్ గవాయ్

feature-image

Play all audios:

Loading...

దిల్లీ: కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్న అంశంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai) కీలక వ్యాఖ్యలు చేశారు. లాయర్లు సెలవు దినాల్లో పని చేయడానికి


ఇష్టపడటం లేదన్నారు. వేసవి సెలవుల అనంతరం తన కేసును విచారించాలని ఓ న్యాయవాది కోరారు. సీజేఐ జస్టిస్ గవాయ్‌, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌ మాసిహ్‌తో కూడిన ధర్మాసనానికి ఆ అభ్యర్థన ఆగ్రహం తెప్పించింది.


‘‘న్యాయమూర్తులు సెలవుల్లో పనిచేస్తున్నారు. అయినా సరే పెండింగ్ కేసుల విషయంలో మమ్మల్ని నిందిస్తున్నారు. కానీ, సెలవుల్లో పనిచేయడానికి ఇష్టపడనిది న్యాయవాదులే’’ అని ప్రధాన న్యాయమూర్తి


పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో పనిచేసే ధర్మాసనాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు (supreme court) నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ


గవాయ్‌ గతవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2019 మే 24న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆరేళ్లలో సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. 370 అధికరణం రద్దు, ఎన్నికల బాండ్ల


రద్దు, పెద్దనోట్ల రద్దు, ఎస్సీల వర్గీకరణ వంటి అనేక సంచలనాత్మక కేసులలో తీర్పులు వెలువరించారు. సీజేఐగా ఆయన ఈ ఏడాది నవంబరు 23 వరకు కొనసాగుతారు.