Kishan reddy: దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

feature-image

Play all audios:

Loading...

హైదరాబాద్‌: తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. బేగంపేట, కరీంనగర్‌, వరంగల్‌లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన


అమృత్‌ భారత్‌ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మహిళలే పని చేయబోతున్నారని తెలిపారు. దేశంలో 1,300 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం


నిర్ణయించిందన్నారు. ప్రమాదాలు జరగకుండా కవచ్‌ టెక్నాలజీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘‘తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రూ.80 వేల కోట్ల పనులకు సంబంధించి ప్రణాళికలు


చేస్తున్నాం. దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తాం. ఎంఎంటీఎస్‌ రెండో ఫేజ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని కిషన్‌రెడ్డి


తెలిపారు.(Telangana News)