Ipl 2025: లఖ్‌నవూ ఆటగాడు దిగ్వేశ్‌ రాఠీని సస్పెండ్‌ చేసిన బీసీసీఐ

feature-image

Play all audios:

Loading...

లఖ్‌నవూ, హైదరాబాద్‌ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో దిగ్వేశ్‌ రాఠీ.. అభిషేక్‌ శర్మతో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీసీసీఐ అతనిపై చర్యలు తీసుకుంది ఇంటర్నెట్‌ డెస్క్‌: లఖ్‌నవూ సూపర్‌


జెయింట్స్‌ (Lucknow Super Giants) స్పిన్‌ బౌలర్‌ దిగ్వేశ్‌ రాఠీపై బీసీసీఐ ఒక మ్యాచ్‌ నిషేధం విధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) సోమవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌


శర్మతో వాగ్వాదానికి దిగడమే దీనికి కారణం. వికెట్లు తీసిన అనంతరం హద్దులు దాటి సంబరాలు చేసుకున్నందుకుగాను ఇప్పటికే దిగ్వేశ్‌ రెండుసార్లు జరిమానాకు గురయ్యాడు.   ఈ సీజన్‌లో మూడోసారి ఐపీఎల్‌ (IPL)


ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను దిగ్వేశ్‌ రాఠీపై బీసీసీఐ (BCCI) చర్యలు తీసుకుంది. మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు, లఖ్‌నవూ సూపర్‌ కింగ్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో


(Gujarat Titans) మే 22న అహ్మదాబాద్‌ వేదికగా ఆడనున్న తదుపరి మ్యాచ్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ సీజన్‌లో దిగ్వేశ్‌ ఖాతాలో ప్రస్తుతం అయిదు డీ మెరిట్‌ పాయింట్లున్నాయి. అలాగే సన్‌రైజర్స్


హైదరాబాద్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకుంది. దిగ్వేశ్‌తో వివాదం నేపథ్యంలో అభిషేక్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతోపాటు అతడి ఖాతాలో ఒక డీ మెరిట్‌ పాయింట్‌ను


వేసింది.