
Play all audios:
‘థగ్ లైఫ్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్హాసన్. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా పాల్గొన్న ప్రెస్మీట్లో సందడి చేశారు. హైదరాబాద్: సినిమాల పరంగా తాను ద్రోణాచార్యుడిని
కాదని, ఇంకా విద్యార్థినేనని ప్రముఖ నటుడు కమల్హాసన్ (Kamal Haasan) అన్నారు. ‘థగ్ లైఫ్’ (Thug Life) మూవీ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఆయన హీరోగా మణిరత్నం తెరకెక్కించిన సినిమా ఇది. త్రిష
(Trisha) హీరోయిన్. శింబు, నాజర్, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 5న సినిమా విడుదల కానున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. * ఆ పోస్టు నేను పెట్టలేదు..: ట్రోల్స్పై
స్పందించిన ‘భైరవం’ దర్శకుడు ‘‘సినిమా విషయంలో వీళ్లు (చిత్ర బృందం) నన్ను ద్రోణాచార్యుడు అంటున్నారు. అలా అని నా నుంచి మీరు ఎలాంటి పాఠాలు ఆశించొద్దు. నేను సినిమా విద్యార్థిని. నేను మీకు
నేర్పాలంటే ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటూనే ఉన్నా.. మీరూ నాతో కలిసి నేర్చుకోండి. మణిరత్నం దర్శకత్వంలో నటించడం నాకు కంఫర్ట్. ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో తనికెళ్ల భరణి సంభాషణలు
రాయాల్సి ఉంది. కానీ, మరో రచయితో కలిసి నేను రాశా. అశోక్ సెల్వన్ ప్రతిభావంతుడు. నాజర్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో అశోక్ కూడా అంతే. నేను శింబు సినిమాలు చూస్తూ పెరిగా (నవ్వుతూ). అతడిది సినీ
నేపథ్య కుటుంబం. శింబు.. చైల్డ్ ఆఫ్ సినిమా. అందుకే మేం ఒకరితో ఒకరం కనెక్ట్ అయ్యాం. మాకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. ‘థగ్ లైఫ్’లో నటుల పెర్ఫామెన్స్, రొమాన్స్ ఆకట్టుకుంటుంది. ఈ
విషయంలో మణిరత్నానికి థాంక్స్. మణిరత్నాన్ని సుహాసిని వివాహం చేసుకోకముందే నేను, ఆయన సినిమా ద్వారా ఒక్కటయ్యాం. ‘థగ్ లైఫ్’ టీమ్ అద్భుతం. అందుకే సినిమా ఈవెంట్లను ఇంతగా సెలబ్రేట్ చేస్తున్నాం.
వాస్తవానికి ఈ చిత్రానికి ప్రమోషన్స్ అవసరం లేదు. ‘నాయకుడు’ సినిమాకి మించి ‘థగ్ లైఫ్’ ఉంటుందని మాటిస్తున్నా. మీ స్పందన కోసం వేచి చూస్తున్నా. మలయాళంలో నేను హీరోని అయ్యా. తెలుగులో స్టార్ని
అయ్యా. స్టార్గా నేను పుట్టిన ఇల్లు ఇదే (టాలీవుడ్)’’ అని పేర్కొన్నారు.