Mysore sandal soap: మైసూర్‌ శాండల్‌ సోప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తమన్నా.. సోషల్‌ మీడియాలో రచ్చ.. రచ్చ

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్‌ శాండల్‌ సోప్‌ (Mysore Sandal soap) బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఎంపికయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం


(Karnataka Govt) నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల కాలానికి రూ.6.2 కోట్లు చెల్లించేలా ప్రభుత్వరంగ సంస్థ ‘ కర్ణాటక సోప్స్‌ అండ్ డిటర్జెంట్స్‌ లిమిటెట్‌ సంస్థ’ (కేఎస్‌డీఎల్‌)తో ఆమె ఒప్పందం


కుదుర్చుకున్నారు. మైసూర్‌ శాండల్‌ సోప్‌తోపాటు ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు కూడా ఆమె ప్రకటనలు చేయనున్నారు. అయితే, ఇక్కడే తమన్నా వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటకలో ఎంతో మంది టాలెంటెడ్


వ్యక్తులు ఉన్నప్పటికీ, ఏరి కోరి ఇతర రాష్ట్రానికి చెందిన తమన్నానే ఎందుకు ఎంచుకున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మైసూర్‌


రాజు కృష్ణరాజ్‌ వడియార్‌ -4  మైసూర్‌ శాండల్‌ సోప్‌ సంస్థను 1900 సంవత్సరంలో బెంగళూరులో స్థాపించారు. 1916లో సబ్బుల తయారీని వేగవంతం చేసిన ఈ సంస్థ.. కేవలం కర్ణాటకలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో


ఎంతో పేరు తెచ్చుకుంది. క్రమంగా కర్ణాటకకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అలాంటి ప్రఖ్యాత కంపెనీకి తాజాగా తమన్నా బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక కావడం ఆమె కెరీర్‌లో ఓ మైలు రాయిగానే చెప్పాలి. ఇప్పటికే


ఎన్నో ప్రకటనల్లో నటించినప్పటికీ.. ఇది మాత్రం కచ్చితంగా ప్రత్యేకమే. ఇదీ వివాదం.. మైసూర్‌ శాండల్‌ సోప్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన తమన్నాను.. సామాజిక మాధ్యమాల వేదికగా అభినందించే వారు


కొందరైతే.. మరికొందరు మాత్రం అటు ప్రభుత్వాన్ని, ఇటు ఆమెపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటకలో చాలా మంది టాలెంటెడ్‌ వ్యక్తులు ఉండగా.. ఇతర రాష్ట్రానికి చెందిన ఆమెను ప్రకటన కర్తగా ఎంపిక


చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శిస్తున్నారు. దీనిపై కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తాజాగా స్పందించారు. ఈ


సబ్బులకు కర్ణాటకలో ఇప్పటికే మంచి డిమాండ్‌ ఉందని, ఈ ఉత్పత్తిని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా పలువురు వాణిజ్య నిపుణుల సలహాతోనే ఆమెను


ఎంపిక చేసినట్లు చెప్పారు. 2028 నాటికి కేఎస్‌డీఎల్‌ వార్షిక ఆదాయాన్ని రూ.5 వేల కోట్లకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అయితే, ఈ వివాదంపై తమన్నా ఇప్పటి వరకు స్పందించలేదు.