Crime news: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

feature-image

Play all audios:

Loading...

పీలేరు: అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బాలమువారిపల్లి వద్ద కారు బావిలోకి దూసుకెళ్లింది (Crime News). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. (Andhra Pradesh News)


కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన శివన్న, లోకేశ్, గంగులయ్య, సునీల్, తిప్పారెడ్డి అనే వ్యక్తులు పీలేరులో జరుగుతున్న క్యాటరింగ్ పనులకు బయలుదేరారు. ఆదివారం వేకువ జామున పీలేరు మండలం


బాలమువారిపల్లె వ్యవసాయ పొలాల సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సునీల్, తిప్పారెడ్డి ప్రాణాలతో బయటపడగా.. శివన్న, లోకేశ్‌,


గంగులయ్య మృతిచెందారు. ఈమేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.