
Play all audios:
నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని.. కాంగ్రెస్, భాజపాలు చేస్తున్న రాజకీయాల్లోనే నాణ్యత లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) విమర్శించారు. హైదరాబాద్: నాణ్యత లేనిది
కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని.. కాంగ్రెస్, భాజపాలు చేస్తున్న రాజకీయాల్లోనే నాణ్యత లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
అశాస్త్రీయ నివేదికలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో తప్పు లేదని ఎద్దేవా చేశారు. ‘‘శాస్త్రీయ
వివరాలు లేకుండానే కాంగ్రెస్, భాజపా ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది. కాళేశ్వరం తెలంగాణకు జీవధార.. కేసీఆర్ (KCR) ఒక దార్శనికుడు’’ అని
కేటీఆర్ పేర్కొన్నారు. (Telangana News)