
Play all audios:
వివాహేతర సంబంధం కారణంగా ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలిలో చోటు చేసుకుంది. రాజోలి: వివాహేతర సంబంధం కారణంగా
ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలిలో చోటు చేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజోలికి చెందిన
మహిళ (32)కు భర్త, కుమార్తె ఉన్నారు. ఇదే గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పుల్లన్నతో మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 12న ఇద్దరూ గ్రామం విడిచి
వెళ్లిపోయారు. ఈ ఘటనపై అప్పట్లో స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. కుమార్తెను చూడాలనిపించి మహిళ.. ఈనెల 25న గ్రామానికి వచ్చి ఇష్టపూర్వకంగానే అతనితో వెళ్లినట్లు పోలీసుల ఎదుట
చెప్పింది. దీంతో ఇద్దరినీ పోలీసులు ఇళ్లకు పంపించారు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడంతో 27న పుల్లన్న ఎలుకల మందు తాగడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం
తెలియడం, మరో వైపు భర్త కూడా తీవ్రంగా బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన మహిళ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు
చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.