
Play all audios:
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సమాచార శాఖమంత్రి కొలుసు పార్థ సారధి మీడియాకు వివరించారు. కేబినెట్ నిర్ణయాలు ఇవే.. * సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం.
త్వరలోనే విద్యుత్ ఇంధన వనరుల కేంద్రంగా మారనున్న అనంతపురం * వివిధ పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం.. టూరిజం పాలసీకి అనుగుణంగానే వీరికి ప్రోత్సాహకాలు * డైకిన్ ఏసీ తయారీ సంస్థకు శ్రీసిటీలో
విస్తరణకు అనుమతి * ప్రాజెక్టు వయబిలిటి దృష్టిలో ఉంచుకొని తిరిగి 500 ఎకరాలు కేటాయింపు * అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. 20
శాతం సీట్లు ఏపీ విద్యార్ధులకు కేటాయించేలా రిజర్వేషన్ * అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు వద్ద ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం * పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన
కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం * 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం కోసం చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం * ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 22ఏ నిషేధ జాబితాలోని
ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుతో పాటు ఫీజు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం * కడప జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ కి 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ * సత్యసాయి జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ 500
మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు భూ కేటాయింపు చేసేందుకు ఆమోదం * నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 615 ఎకరాల భూమి పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా బదలాయించేందుకు అంగీకారం *
రాజకీయ కక్షతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం * చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాలు అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు
కేబినెట్ ఆమోదం * అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజక్టు కోసం ఐబీఎం, టీసీఎస్లతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం * రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు ఏపీ
మోటారు వాహనాల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం