Pak spy: పాక్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో వ్యక్తి అరెస్టు

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని దాయాది పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. తాజాగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో


రాజస్థాన్‌లో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు (Pak spy). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ (Rajasthan)లోని డీగ్‌ ప్రాంతానికి చెందిన ఖాసిం (32) అనే వ్యక్తిని అదుపులోకి


తీసుకున్నారు. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఖాసీం పాక్‌లోని కొంతమందితో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ దేశంలో కూడా అతడు పర్యటించినట్లు తెలిసింది. నిందితుడికి సంబంధించిన


ఫోన్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించి.. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. * ‘పహల్గాం’కు ముందే పాక్‌కు వెళ్లొచ్చిన హారూన్‌ పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటివరకు


యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.