
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: భారత్లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే సరకులపై బంగ్లాదేశ్ (Bangladesh) విధించిన ఆంక్షలకు ప్రతిగా.. ఇండియా (India) ఆ దేశ దిగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ
నేపథ్యంలో భారత్తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటామని మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ విలేకరులతో మాట్లాడారు.
‘భారత్ తీసుకున్న చర్యలకు సంబంధించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదు. వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకొంటాం. అఖౌరా, డాకి పోర్టులతో పాటు కొన్ని
సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్లు వార్తల ద్వారా తెలిసింది. ఇది రెండు దేశాలకు మంచి విషయం. వస్త్ర పరిశ్రమలో భారత్ అగ్రస్థానంలో ఉందని మేము భావిస్తున్నాం.
అయినప్పటికీ.. ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఇది మా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. భారత్- బంగ్లాలు పొరుగుదేశాలు. సహజంగానే వాణిజ్యం, రవాణా వంటి వాటిల్లో పోటీ ఉంటుంది. ఈ
క్రమంలోనే కొన్ని సార్లు మేము పరిమితులు విధిస్తాం. భారత్ కూడా అలాగే చేస్తోంది. వాణిజ్య ప్రక్రియలో ఇది భాగం మాత్రమే. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే ఇరుదేశాలు చర్చలతో పరిష్కరించుకుంటాయి’ అని ఆయన
పేర్కొన్నారు. * ఢాకా అల్లర్ల కేసులో బంగ్లా నటి నుస్రత్ అరెస్ట్ గత నెలలో భారత్ నుంచి వచ్చే సరకులపై బంగ్లా ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిస్పందనగా.. బంగ్లాదేశ్ నుంచి దిగుమతులపై
న్యూదిల్లీ ఆంక్షలు విధించింది. అందులో అక్కడి నుంచి దిగుమతయ్యే రెడీమేడ్ దుస్తులు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్, పత్తి, నూలు వ్యర్థాలు, ప్లాస్టిక్, పీవీసీ వస్తువులు,
కలప ఫర్నీచర్ తదితరాలు ఉన్నాయి. ఈ సరకులను కోల్కతా నౌకాశ్రయం, ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం నుంచి మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు. అయితే, బంగ్లా నుంచి దిగుమతయ్యే చేపలు, ఎల్పీజీ,
వనస్పతి, కంకర వంటి వాటికి ఈ ఆంక్షలు వర్తించవని భారత్ స్పష్టం చేసింది.