
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో తాను కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ విశాల్ (Vishal) ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘నా స్నేహితుడు
విజయ్ సేతుపతిని చాలాకాలం తర్వాత చెన్నై విమానాశ్రయంలో కలిశా. అతడిని ఎప్పుడు కలిసినా ఆనందమే. ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. కొన్ని నిమిషాలపాటే మేం మాట్లాడుకున్నా అదెంతో బాగుంది’’ అని పేర్కొన్నారు.
విజయ్ సేతుపతికి ఆల్ ది బెస్ట్ చెప్పిన విశాల్.. ఆ నటుడిని త్వరలోనే మరోసారి కలవాలని ఆకాంక్షించారు. * ‘బేబీ’ రీమేక్!.. వైదొలిగిన హీరో: స్పందించిన దర్శకుడు తమిళనాడులోని విల్లుపురం జిల్లా
కూవాగంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన అందాల పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ రోజు
మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడమే అందుకు కారణమని ఆయన టీమ్ చెప్పినట్టు కోలీవుడ్లో వార్తలొచ్చాయి. ఆ ఘటన తర్వాత విశాల్ తొలిసారిగా కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతికి ‘మద గజ
రాజ’తో విశాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సేతుపతి నటించిన ‘ఏస్’ మూవీ ఈ నెల 23న విడుదల కానుంది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.