
Play all audios:
కళ కంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కమల్ హాసన్ అన్నారు. ‘థగ్ లైఫ్’ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇంటర్నెట్ డెస్క్: కళ కంటే భావోద్వేగాలకే అధిక
ప్రాధాన్యత ఇవ్వాలని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) అన్నారు. ‘థగ్ లైఫ్’ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. పహల్గాం ఘటన చాలా
బాధాకరమని అన్నారు. ‘‘అలాంటి బాధాకర పరిస్థితుల్లో మేం సినిమా ప్రచారాలను, సెలబ్రేషన్స్ను కూడా వాయిదా వేసుకున్నాం. ఇప్పటి వరకూ థగ్ లైఫ్కు సంబంధించి అనుకున్న స్థాయిలో భారీ ఈవెంట్ను
నిర్వహించలేదు. ఆపరేషన్ సిందూర్ పూర్తి అయింది అని ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే మేం ఇప్పటికీ ఆ ఈవెంట్ను నిర్వహించలేదు. ఒకవైపు అలాంటి బాధాకర పరిస్థితులు ఉంటే వేడుకలు
చేసుకోలేం కదా. కళ కంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. కశ్మీర్ టూరిజాన్ని పెంచడానికి.. పహల్గాం ఘటన తర్వాత పర్యాటకుల్లో భయాన్ని పోగొట్టడానికి కచ్చితంగా నేను అక్కడికి వెళ్తాను.
ఎందుకంటే అది కూడా నా ప్రదేశమే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ నాకు హోమ్ టౌన్తో సమానం’’ అని చెప్పారు. * థియేటర్ తర్వాత నేరుగా యూట్యూబ్లోనే.. ఆమిర్ ఖాన్ కీలక నిర్ణయం! ‘థగ్ లైఫ్ (Thug
Life)’ రిలీజ్ నేపథ్యంలో ప్రచారాల్లో భాగంగా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మే 16న భారీ స్థాయిలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, ఆ సమయంలో దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా దాన్ని
వాయిదా వేసిన విషయం తెలిసిందే. ‘నాయకన్’ (1987) వంటి హిట్ తర్వాత కమల్ - మణిరత్నం కాంబినేషన్లో నిర్మించిన చిత్రం కావడంతో ‘థగ్ లైఫ్’పై అందరిలో ఆసక్తి నెలకొంది. గ్యాంగ్స్టర్, యాక్షన్
డ్రామా ఫిల్మ్గా ఇది రానుంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 5న ఈ సినిమా విడుదల కానుంది.