Ipl 2025: ఐపీఎల్‌ పునఃప్రారంభానికి పొంచి ఉన్న వాన ముప్పు

feature-image

Play all audios:

Loading...

ఈ రోజు రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది.


ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ (IPL) వాయిదా పడిన విషయం తెలిసిందే. పఠాన్‌ కోట్‌, జమ్ములో పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడుల నేపథ్యంలో... మే8న ధర్మశాలలో


దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), పంజాబ్ కింగ్స్‌ (Punjab Kings) మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పునఃప్రారంభం కానుంది. రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ (Royal Challengers Bengaluru), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders)


తలపడనున్నాయి.  అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నస్వామి


స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటివరకు తాను ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో


స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 12 మ్యాచుల్లో అయిదింట్లో విజయం సాధించి, ఆరో స్థానంలో ఉంది.