
Play all audios:
Japan Minister: సరిపడా బహుమతులు వస్తుండటంతో తాము ఎప్పుడూ బియ్యం కొనలేదని ఓ మంత్రి నోరుజారి, క్షమాపణలు చెప్పారు. ఇంటర్నెట్డెస్క్: ఓ కార్యక్రమంలో జనాలను ఆకట్టుకునేందుకు వ్యాఖ్యలు చేసి
ఇరకాటంలో పడ్డారు జపాన్ వ్యవసాయ శాఖ మంత్రి (Japan Minister). ఒకవైపు విమర్శలు.. మరోవైపు భార్య చీవాట్లతో చివరకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ విషయం ఏంటంటే..? సరిపడా బహుమతులు వస్తుండటంతో తాము
ఎప్పుడూ బియ్యం (Rice prices) కొనలేదని ఆదివారం ఫండ్రైజింగ్ కార్యక్రమంలో జపాన్ మంత్రి టకు ఎటో నోరు జారారు. ఆహారపదార్థాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో ఈ వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహానికి
దారితీశాయి. వెంటనే రాజీనామా చేయండంటూ పలువురు కామెంట్లు పెట్టారు. ఈ సమయంలో ఆయన మీడియా ఎదుట వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. జనాలను చూసి అలా నోరు
జారినందుకు క్షమాపణలు చెప్పారు. ‘‘బియ్యం కొనలేదని నేను చెప్పిన మాటలకు నా భార్య ఫోన్ చేసి తిట్టింది. మనం ఇద్దరమే కాబట్టి ఇంట్లో కావాల్సినంత బియ్యం ఉన్నాయని, ఎప్పుడైనా అయిపోతే.. బయటకు వెళ్లి
కొనుక్కోవాల్సిందేనని చెప్పింది’’ అని అన్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ వస్తోన్న డిమాండ్లకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. * 60 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్కు ‘గూఢచారి’ వస్తువులు జులైలో జపాన్ (Japan)లో
ఎగువసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందన చూస్తుంటే.. బియ్యం అక్కడ కీలకాంశమని అర్థమవుతోంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్లో అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రటిక్
పార్టీకి మద్దతు 27.4 శాతంగా మాత్రమే ఉంది. పెరుగుతోన్న బియ్యం ధరలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతి పది మందిలో తొమ్మిది మంది అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రధాన ఆహారధాన్యాల
ధరలు రెట్టింపు అయ్యాయి. వేడి వాతావరణం కారణంగా పంటలు దెబ్బతినడం, దేశంలో పర్యాటకుల తాకిడి డిమాండ్ను పెంచడం వంటి అంశాలు అందుకు దోహదం చేశాయి. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం అత్యవసర నిల్వల నుంచి
రైస్ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. కాకపోతే అది పెద్దగా ప్రయోజనం చూపించట్లేదని తెలుస్తోంది.