Operation sindoor: భీకర పోరు వేళ.. చాయ్‌, లస్సీ అందిస్తూ.. సైనికులకు తోడుగా పదేళ్ల బాలుడు

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లోని ఉగ్ర, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో డ్రోన్లు, క్షిపణులతో భారత భూభాగాలపై


పాక్‌ (Pakistan) దళాలు దాడులకు తెగబడ్డాయి. వీటిని మన సైన్యం దీటుగా తిప్పికొడుతున్న వేళ.. భారత సైన్యానికి ఓ పదేళ్ల బాలుడు బాసటగా నిలిచాడు. సైనికులకు మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి


అందిస్తూ ఆపరేషన్‌లో తనవంతు పాత్ర పోషించాడు. ఇది గుర్తించిన స్థానిక సైనికాధికారులు ఇటీవల ఆ బాలుడిని సత్కరించడం విశేషం. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లా మందేట్‌ ప్రాంతంలో ఉన్న తారావాలీ అనే


గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు 2 కి.మీ దూరంలోనే ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. శత్రు దేశంతో భారత సైన్యం తలపడుతున్న వేళ.. అదే గ్రామానికి చెందిన శ్రవణ్‌


సింగ్‌ అనే పదేళ్ల కుర్రాడు సైనికులకు తోడుగా నిలవాలని భావించాడు. వాళ్లు అడగకముందే.. వారికి మంచినీరు, ఐస్‌, చాయ్‌, పాలతోపాటు లస్సీ తదితర ఆహార పదార్థాలను అందించాడు. ఇది గమనించిన స్థానిక విభాగం


కమాండింగ్‌ ఆఫీసర్‌ మేజర్‌ జనరల్‌ రంజిత్‌ సింగ్‌ మన్రాల్‌.. ఆ బాలుడిపై ప్రశంసలు కురిపించారు. * పన్నులుండవ్‌, లగ్జరీ లైఫ్‌.. సంపన్నుల స్వర్గధామం ‘మొనాకో’ తమ కుమారుడిని చూస్తుంటే గర్వంగా ఉందని,


సైనికులు కూడా తమ బిడ్డను ఇష్టపడుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శ్రవణ్‌ తండ్రి పేర్కొన్నారు. నాలుగో తరగతి చదువుతున్న అతడికి ఆ పనులు చేయాలని ఎవ్వరూ చెప్పలేదని, సొంతగా అతడే చేశాడని


చెప్పారు. ‘‘పెద్దయ్యాక నేనూ సైనికుడిని అవుతా. దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నా’’ అని శ్రవణ్‌ సింగ్‌ మీడియాతో చెప్పడం గమనార్హం.