
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ‘భైరవం’ సినిమాతో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు నటుడు మంచు మనోజ్. ఆయనకు విషెస్ చెబుతూ సాయి దుర్గా తేజ్ పోస్ట్ పెట్టారు. ఆయన్ని స్క్రీన్పై చూడడం కోసం
ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ‘‘నువ్వు ఇన్ని రోజులు వ్యక్తిగత కారణాల వల్ల వెండితెరకు దూరంగా ఉన్నందుకు కోపంగా ఉంది. కానీ.. జీవితంలో ఎన్ని త్యాగాలు చేశావో నాకు తెలుసు. స్క్రీన్పై నీ
ఎనర్జీ, తెరపై నువ్వు కనిపించే విధానం అన్నిటికీ నేను అభిమానిని. నువ్వు మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. ఇన్నిరోజులు బిగ్స్క్రీన్పై నిన్ను మిస్ అయ్యాను. గజపతి పాత్ర నీ కెరీర్లోనే
బెస్ట్గా నిలుస్తుంది. నా బాబాయ్వి, సోదరుడివి కుటుంబసభ్యుడి కంటే ఎక్కువ. నీ కమ్బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆల్ ది బెస్ట్’’ అని పోస్ట్ పెట్టారు. మనోజ్తో దిగిన ఫొటోను షేర్ చేశారు.
అలాగే నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్లను కూడా సాయి దుర్గా తేజ్ విష్ చేశారు. * పవన్ కల్యాణ్ ‘ఓజీ’లో నారా రోహిత్కు కాబోయే భార్య.. అధికారికంగా చెప్పిన నటుడు విజయ్ కనకమేడల
దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ (Manoj Manchu) నటించిన సినిమా ‘భైరవం’ (Bhairavam). అదితి శంకర్, ఆనంది, దివ్య
పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే30న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ ముగ్గురు హీరోలు సాయి దుర్గా తేజ్తో కలిసి ‘సరదా సిట్టింగ్’ అంటూ చేసిన ఇంటర్వ్యూ కూడా అందరినీ
ఆకట్టుకుంటోంది.