Shashi tharoor: పాక్‌లో ఉగ్రవాదులు హతమైతే సంతాపమా..? శశిథరూర్‌

feature-image

Play all audios:

Loading...

భారత్‌ దాడుల్లో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్ అసహనం వ్యక్తంచేశారు. ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (operation


sindoor) సమయంలో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ (Pakistan) అనుసరిస్తున్న


విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో శశిథరూర్‌ (Shashi Tharoor) నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియా


(Colombia)కు వెళ్లింది. ఈక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి వ్యక్తపరచకుండా.. భారత్‌ దాడుల తర్వాత పాక్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి


కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడం మమ్మల్ని నిరాశ పరిచింది. మా ఆత్మరక్షణ హక్కును మాత్రమే మేము వినియోగించుకున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌కు దారితీసిన పరిస్థితులను గురించి కొలంబియా అధికారులతో వివరంగా


మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ దేశం కూడా అనేక ఉగ్రదాడులను చూసింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్‌ అనేక దాడులను భరించింది. పాకిస్థాన్‌ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా.. పక్క


దేశాలపై దాడి కోసం వినియోగిస్తోంది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాత్రమే మా విధానాలు ఉంటాయి’ అని థరూర్‌ పేర్కొన్నారు. పహల్గాం దాడి వెనక పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్‌ వద్ద కచ్చితమైన


ఆధారాలున్నాయని థరూర్‌ వెల్లడించారు. ఈసందర్భంగా పాక్‌లోని మొత్తం రక్షణ పరికరాల్లో 81శాతం చైనా నుంచి అందుతున్నవేనని తెలిపారు. * ముష్కరులను ఎగదోస్తే ఉగ్ర నరసింహావతారమే పహల్గాంలో పర్యాటకులపై


ఉగ్రవాదులు పాశవిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించి.. పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ


దాడుల్లో 170 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి పాక్‌ సైన్యం స్పందించి.. మనపై ప్రతిదాడులకు దిగింది. వాటిని మన బలగాలు సమర్థమంతంగా తిప్పికొట్టాయి.


ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది.