Miss world 2025: మిస్‌ వరల్డ్‌ 2025గా మిస్‌ థాయిలాండ్‌ ఓపల్‌ సుచాత

feature-image

Play all audios:

Loading...

ఉత్కంఠగా సాగిన 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌: ఉత్కంఠగా సాగిన 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో


థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ  ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మిస్‌ వరల్డ్‌ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని సుచాతా చువాంగ్‌కు ధరించారు. 1వ


రన్నర్‌ అప్‌గా ఇథియోపియా, 2వ రన్నర్ అప్‌గా మిస్‌ పోలెండ్, 3వ రన్నర్ అప్‌గా మిస్‌ మార్టినిక్ నిలిచారు. మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన సుచాతకు.. రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. సుచాత..


థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సుచాతకు ప్రపంచ సుందరి కిరీటం దక్కడంతో థాయిలాండ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ‘ఓపల్‌ ఫర్‌


హెర్‌’ ప్రాజెక్టును ప్రమోట్‌ చేసేందుకు సుచాత మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్నారు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే తన లక్ష్యమని ఇటీవల ‘ఈటీవీ’కి ఇచ్చిన ఓ


ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్‌ ముప్పు నుంచి బయటపడిన ఆమె.. థాయ్‌లాండ్‌లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్‌ బాధితులకు అండగా ఉండేందుకు నిధుల


సేకరించడంతోపాటు, కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ప్రభావితం చూపే లక్ష్యంతో యువత ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. గత 20 రోజులుగా ప్రపంచాన్ని అలరించిన అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలు


ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. హైదరాబాద్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో 72వ మిస్‌వరల్డ్‌ తుది పోటీలతో సందడి నెలకొంది. ఆఖరి అంచె పోటీల్లో సత్తా చాటి క్వార్టర్‌ ఫైనల్స్‌కు 40 మంది ఎంపికవ్వగా..


ఒక్కో ఖండం నుంచి ఇద్దరు ముందంజ వేశారు. ఇలా ఫైనల్‌ రౌండ్‌కు నలుగురు ఎంపికవ్వగా.. అందులో థాయ్‌లాండ్‌ సుందరి సుచాతను మిస్‌ వరల్డ్‌ కిరీటం వరించింది. థాయిలాండ్‌లో అభిమానుల సంబరాలు