
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు ఇచ్చే షెంజెన్ వీసా (Schengen visa) దరఖాస్తుల్లో గతేడాది లక్షలాది సంఖ్యలో తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో
నిలిచింది. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65లక్షల అప్లికేషన్లు రిజెక్టయ్యాయి. తద్వారా మన దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు కోల్పోయారు. వీటికి సంబంధించి యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన
నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాండ్ నాస్ట్ నివేదిక ప్రకారం.. షెంజెన్ సభ్యదేశాలకు గతేడాది వచ్చిన మొత్తం వీసా దరఖాస్తుల్లో 17లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ దరఖాస్తు రుసుంలతో రూ.1410
కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. భారత్ నుంచి 11.08 లక్షల దరఖాస్తులు రాగా.. వాటిలో 1.65లక్షలు రిజెక్టయ్యాయి. తిరస్కరణ రేటు 15శాతంగా ఉంది. గతేడాది జూన్లో వీసా రుసుమును 80 నుంచి 90 యూరోలకు
పెంచిన విషయం తెలిసిందే. దీంతో సరాసరి 85 యూరోలుగా పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే.. మొత్తంగా రూ.136 కోట్లు నష్టపోయినట్లు తాజా నివేదిక అంచనా వేసింది. * ‘యాపిల్’కు ట్రంప్ వార్నింగ్..
అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! ప్రపంచంలో అత్యధికంగా తిరస్కరణకు గురైన షెంజెన్ వీసా దరఖాస్తుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానం అల్జీరియా (1,85,101), తుర్కియే (1,70,129),
భారత్ (1,65,266), మొరాకో (1,15,774), చైనా (80,703) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. అయితే, అత్యధిక సంఖ్యలో భారతీయుల దరఖాస్తులు తిరస్కరించిన దేశాల్లో ఫ్రాన్స్ ముందుంది. ఒక్క ఫ్రాన్స్ 31వేల
భారతీయుల అప్లికేషన్లను తిరస్కరించింది. స్విట్జర్లాండ్ (26వేలు), జర్మనీ (15వేలు), స్పెయిన్ (15వేలు), నెదర్లాండ్స్ (14.5వేలు) కూడా భారీ సంఖ్యలో భారతీయుల వీసా దరఖాస్తులను తిరస్కరించాయి.
అయితే, ఆయా దేశాలు భారీ సంఖ్యలో వీసాలు జారీ చేశాయి. ఇక స్లోవేనియాకు 1278 భారతీయ దరఖాస్తులు రాగా.. అందులో సగం రిజెక్టు కావడం గమనార్హం.