
Play all audios:
Pakistan ఇంటర్నెట్డెస్క్: ఆపరేషన్ సిందూర్ మొదలైన నాటినుంచి జమ్మూకశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్కు వెళ్లిన కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టిపెట్టాయి. దీనిలో భాగంగా
అనుమానాస్పదంగా అనిపించిన ఫోన్ సంభాషణలు, చాటింగ్లు, ఈమెయిల్స్, మెసేజ్ల వివరాలను సేకరించడం మొదలుపెట్టాయి. భారత్లోనే ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్లీపర్ సెల్స్ వంటి వారి వివరాలు
సేకరించడమే దీని లక్ష్యం. ఈక్రమంలో భాగంగా ఈమెయిల్, టెలిఫోన్ కాల్స్, మెసేజ్లు, చాటింగ్లు, ఎన్క్రిప్టెడ్, పాపులర్ సోషల్ మీడియా యాప్ ద్వారా జరిగిన కమ్యూనికేషన్ల వాల్యూమ్ల ఆధారంగా
సేకరిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్లో 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం తర్వాత భారత్లోని ఉగ్రసానుభూతిపరులు వారి హ్యాండిలర్లు, ఐఎస్ఐ ఆపరేటీవ్లతో ఏమైనా కనెక్ట్ అయ్యారేమో గుర్తించేందుకు ఈ చర్యలు
చేపట్టారు. ‘‘ఉగ్ర సంస్థ లేదా దాని హ్యాండ్లర్లతో ఎవరైనా టచ్లో ఉన్నారేమో గుర్తించడమే ఈ చర్యల వెనక లక్ష్యం. మే7 తర్వాత వీరి కదలికలు అనుమానంగా ఉంటే అరెస్టు చేసి ప్రశ్నిస్తాము’’ అని ఓ సీనియర్
భద్రతాధికారి ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లోని వారు దళాల కదలికలు, ఆయుధాల వివరాలు వంటివి ఏమైనా పాక్కు లీక్ చేశారా అనే అంశంపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.
దీంతోపాటు ఇప్పటి వరకు భద్రతా ఏజెన్సీ దృష్టిలోపడకుండా ఉన్న ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ను గుర్తించేందుకు కూడా ఈ చర్య ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్తో సంబంధం ఉన్న గూఢచర్య
నెట్వర్క్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తర్ప్రదేశ్లో ఒకరిని
అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు
ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు.