
Play all audios:
హైదరాబాద్: చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఉన్న భవనంలో జరిగిన ప్రమాదం (Gulzar House fire Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 17 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ
భవనం మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసముంటోంది. గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా వ్యాపారి వద్దకు బంధువులు వచ్చారు. మంటలు చెలరేగడంతో ఇంట్లో పొగ
కమ్ముకుంది. దీంతో ఊపిరాడక పలువురు స్పృహ తప్పి పడిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఇంట్లోకి పొగ చేరడం.. ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు
ఆటంకం ఏర్పడింది. నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగులగొట్టి స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని
అంబులెన్స్లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరు మార్గమధ్యలోనే మృతిచెందారు.