Asiatic lion: గుజరాత్‌లో భారీగా పెరిగిన ఆసియా సింహాల సంతతి

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లో ఆసియా సింహాల (Asiatic lion)  సంఖ్య భారీగా పెరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ (Bhupendra Patel) పేర్కొన్నారు. సింహాల జనాభాపై నిర్వహించిన 2025


గణాంకాలను విడుదల చేస్తూ.. గతంలో 674 ఆసియా సింహాలు ఉండేవని, వాటి సంఖ్య ప్రస్తుతం 891కి చేరిందని వెల్లడించారు. జునాగఢ్, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, రాజ్‌కోట్, మోర్బి, సురేంద్రనగర్, దేవభూమి


ద్వారక, జామ్‌నగర్, అమ్రేలి, పోర్ బందర్, బోటాడ్ జిల్లాల్లో ఈ సింహాలు విస్తరించాయని తెలియజేశారు. మే 10- 11 తేదీల్లో సింహాల ప్రాథమిక జనాభా గణన నిర్వహించగా, తుది జనాభా గణనను మే 12-13 తేదీల్లో


ప్రాంతీయ, జోనల్, సబ్-జోనల్ అధికారులు, ఎన్యూమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యూమరేటర్లు, ఇన్‌స్పెక్టర్లు సహా 3,000 మంది స్వచ్ఛంద సేవకుల సహాయంతో నిర్వహించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆహారం, నీరు, రక్షణ


కల్పించే విషయంలో స్థానిక అటవీ యంత్రాంగం తీసుకుంటున్న శ్రద్ధ, అడవులను ధ్వంసం చేయకుండా తీసుకుంటున్న చర్యలతో గిర్‌ అడవుల్లోని సింహాల సంఖ్య పెరుగుతోందని అన్నారు. అధునాతన ఆయుధాలు, సీసీ టీవీలు,


రేడియో కాలర్‌ , జీపీఎస్‌ వంటి నూతన సాంకేతికతల సాయంతో అక్కడి  అటవీ శాఖ సింహాలను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఆసియా సింహాల సంఖ్య పెరుగుతున్న వేళ మృగరాజులను చూసేందుకు వస్తున్న పర్యాటకులు


సైతం పెరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.