Telangana news: మావోయిస్టు పేరుతో లేఖ.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుటుంబానికి బెదిరింపులు

feature-image

Play all audios:

Loading...

షాపూర్‌నగర్‌: మేడ్చల్‌ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ సోదరుడి కుటుంబాన్ని లేఖలో లక్ష్యంగా చేసుకున్నారు. రూ.50


లక్షలు ఇవ్వకపోతే కూన రవీందర్‌గౌడ్‌ కుమారుడు కూన రాఘవేందర్‌ గౌడ్‌ను చంపుతామని అందులో పేర్కొన్నారు. రెండు ఇళ్లను బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు


వస్తువులు ధ్వంసం చేసి అక్కడ లేఖను ఉంచారు. కారుపై ఎరుపు రంగు టవల్‌లో లేఖ పెట్టి వెళ్లిపోయారు. ఘటన ఈ నెల 21న జరిగినట్లు రాఘవేందర్‌గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి


దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో ఓ వ్యక్తి మాస్క్‌ ధరించి వచ్చినట్లు గుర్తించారు.  (Telangana News)