
Play all audios:
కేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చేశారు. ఇంటర్నెట్ డెస్క్: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film
Festival) ఇటీవల సందడిగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సినీ వేడుకలో ఇండస్ట్రీకి చెందిన తారలు వారి లుక్స్తో ఆకట్టుకున్నారు. అయితే, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) ఆ వేదిక దగ్గర
ఫొటోలకు పోజిలివ్వడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. పొడవాటి వెస్ట్రన్ వేర్ డ్రెస్లో వచ్చిన ఊర్వశీ.. తాను ఫొటోలు దిగేసమయంలో అక్కడి వారికి అంతరాయం కలిగించారని కొందరు విమర్శించారు. దీనికి
సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ట్రోల్స్ను ఖండిస్తూ.. ఆమె పోస్ట్ పెట్టారు. తాను కేన్స్లో అన్ని నియమాలు పాటించానని తెలిపారు. ‘‘నా ఫొటోషూట్ కారణంగా మెట్లపై దారిని
బ్లాక్ చేశానంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కానీ, నిజం ఏంటంటే.. అక్కడ ఫొటోలు దిగడానికి నేను అనుమతి తీసుకున్నాను. కేన్స్ వేడుకలో ప్రతి నియమాన్ని నేను కచ్చితంగా పాటించాను. ఎంతో గౌరవంగా ఆ
వేడుకలకు హాజరయ్యాను. ఈ విమర్శలకు ప్రధానకారణం అసూయ మాత్రమే. ఇలాంటి ట్రోల్స్ను నేను పట్టించుకోను. ఇవి నా విజయాన్ని ఆపలేవు. మీరు నన్ను ఎంత ట్రోల్ చేసినా నేను అందరిలా తిరిగి మిమ్మల్ని ట్రోల్
చేయడం కోసం డబ్బులు వృథా చేసుకోను’’ అని అన్నారు. దీనికి #Paidtrolls అనే హ్యాష్ ట్యాగ్ను జోడించారు. * థియేటర్ తర్వాత నేరుగా యూట్యూబ్లోనే.. ఆమిర్ ఖాన్ కీలక నిర్ణయం! 2022 నుంచి ఊర్వశీ
రౌతేలా కేన్స్ వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది తన ఫ్యాషన్ స్టేట్మెంట్స్తో సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ఏడాది కూడా విభిన్నమైన వెస్ట్రన్ దుస్తులతో ఆకట్టుకున్నారు. అయితే
వాటిలో ఒక పొడవాటి డ్రెస్ ధరించిన రోజు ఆమె ఈ విమర్శలు ఎదుర్కొన్నారు.