
Play all audios:
హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు
సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ప్రకటనపై సినీ నిర్మాత బన్నీ వాసు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో
రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల గొడవల్లో సినీ పరిశ్రమ నలిగిపోతోంది అనేది ఇప్పటికైనా సరే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గ్రహించాలి.
సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే.. మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని బన్నీ వాసు ఎక్స్లో ట్వీట్ చేశారు. పెద్ద
సమస్యలను పరిష్కరించడపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసర సమస్యలను సృష్టించారు. ఇప్పుడవే పెద్దవయ్యాయి. కామన్ సెన్స్తో ఆలోచించి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కాదు.- నిర్మాత నాగవంశీ