
Play all audios:
Shashi Tharoor | ఇంటర్నెట్డెస్క్: ఐరాస భద్రతా మండలి ఉగ్రజాబితాలో పడకుండా లష్కరే తయ్యిబా ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను చైనా ఎంత కాపాడినా.. తాము మాత్రం వదిలిపెట్టమని
అఖిలపక్ష దౌత్యబృంద సభ్యుడు, ఎంపీ శశిథరూర్ తేల్చి చెప్పారు. తాము ఆ సంస్థపై వీలైనప్పుడల్లా ఐరాస ఆంక్షల కమిటీ దృష్టికి తీసుకొస్తామన్నారు. మండలి తీర్మానాలు, ప్రెస్ స్టేట్మెంట్లలో టీఆర్ఎఫ్లో
పేరును ప్రస్తావించేలా ప్రోత్సహిస్తామన్నారు. బ్రెజిల్ దౌత్యవేత్త సెల్సో అమోరిమ్తో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఐరాస భద్రతా మండలి పునర్ వ్యవస్థీకరణ కూడా అవసరమని థరూర్
వ్యాఖ్యానించారు. ‘‘పాకిస్థాన్ ప్రభుత్వం చైనా అండతో ఆ పేరును తప్పించారు. కనీసం దాని ప్రస్తావన కూడా లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి మనం (భారత్, బ్రెజిల్) భద్రతా మండలిలో లేము. ఈ పరిస్థితి
మారాలి. మనిద్దరం మండలిలో ఉండాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. * భారత్ వెంటే బ్రిటన్ ఇక తరచూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ జరిపించానని చెప్పుకోవడంపై థరూర్
స్పందించారు. తమ విషయంలో ఒకరు వచ్చి మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ పాకిస్థాన్కు ఏమైనా అవసరం ఉండొచ్చేమోనని పేర్కొన్నారు. ‘‘మాకు ఎవరూ ఘర్షణను ఆపమని హితవు పలకాల్సిన అవసరం లేదు.
పాకిస్థాన్కు ఆ అవసరం ఉందేమో. మేము ఏమీ యుద్ధం కోరుకోవడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్కు చెందిన దౌత్య బృందాలు ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించి పరిస్థితిని
వివరిస్తున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం బ్రెజిల్లో పర్యటిస్తోంది. రేపు ఈ బృందం అమెరికాకు చేరుకోనుంది. ఇక కొలరాడో ఘటనపై కూడా థరూర్ ఆందోళన
వ్యక్తంచేశారు. ఆదివారం కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో హమాస్ చెరలోని బందీలకు సంఘీబావం తెలుపుతున్న యూదులపై ఓ వ్యక్తి మండే స్వభావం గల ద్రావణాలు ఉన్న సీసాలను విసిరాడు. ఈ ఘటనలో 8 మందికి
గాయాలయ్యాయి.