Ktr: డాలస్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన కేటీఆర్‌

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అమెరికా పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా డాలస్‌లో అమెరికాలోనే అతి పెద్దదైన మహత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించారు.


అక్కడ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహమే ఆయుధాలుగా భారతీయులందరినీ గాంధీ సమాయత్తం చేశారన్నారు. బ్రిటిష్‌ బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని


విడిపించి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా నేటికీ గాంధీని ప్రశంసిస్తూనే ఉంటారని చెప్పారు. అలాంటి విశ్వనాయకుడి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున డాలస్‌


(ఇర్వింగ్‌)లో నెలకొల్పడంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, కార్యవర్గ సభ్యుల కృషిని కేటీఆర్‌ అభినందించారు. అనంతరం ఆ సంఘం వ్యవస్థాపక


కార్యదర్శి రావు కల్వాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు, దశాబ్దకాలం పాటు రాష్ట్ర అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్, వారి కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ


మరువలేరని చెప్పారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో కేటీఆర్‌ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కేసీఆర్‌ విజన్‌ తెలంగాణకు ఒక గళాన్ని ఇచ్చిందన్నారు.  డా.ప్రసాద్


తోటకూర మాట్లాడుతూ అమెరికాలో అతి పెద్దదైన గాంధీ స్మారకస్థలిని నిర్మించి 10 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ నిర్మాణం ప్రవాస భారతీయుల సమష్టి కృషి, ఐకమత్యానికి నిదర్శనమని చెప్పారు. దీన్ని సాకారం


చేసేందుకు అనుమతులు ఇచ్చిన నగర అధికారులు, దాతలు, కార్యవర్గ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా డాలస్‌ సందర్శనకు వచ్చినవారు ఈ గాంధీ స్మారకస్థలిని సందర్శిస్తూనే


ఉన్నారని చెప్పారు. అనంతరం కేటీఆర్‌ను బోర్డు సభ్యులు రావు కల్వాల, బీఎన్‌ రావు, తైయాబ్‌ కుండావాలా, మురళి వెన్నం, రాజేంద్ర వంకావాలా, అనంత్‌ మల్లవరపు, వినోద్‌ ఉప్పు, షబ్నం మాడ్గిల్‌తో కలిసి


డా.ప్రసాద్‌ తోటకూర ఘనంగా సన్మానించారు. వందలాది ప్రవాస భారతీయులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో కోపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ రమేశ్‌ ప్రేమ్‌ కుమార్, ఎన్‌ఆర్‌ఐ భారాస అమెరికా విభాగం అధ్యక్షుడు


తన్నీరు మహేశ్‌, ఎన్‌ఆర్‌ఐ భారాస గ్లోబల్‌ కన్వీనర్‌ బిగాల మహేశ్‌, నేతలు ఎల్‌.రమణ, తాతా మధు, గ్యాదరి బాలమల్లు, నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, పాడి


కౌశిక్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, బాల్క సుమన్‌, గువ్వల బాలరాజు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గాదరి కిశోర్‌,


క్రాంతి కిరణ్‌, పైలట్‌ రోహిత్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, నోముల భగత్‌, బానోతు చంద్రావతి, గండ్ర జ్యోతి, దామోదర్‌, జాన్సన్‌ నాయక్‌, అమరేందర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్‌, యుగంధర్‌రావు,


విష్ణువర్ధన్‌రెడ్డి, అభిలాష్‌ రంగినేని, సోమ ఉపేందర్‌రెడ్డి, వంశీరెడ్డి, అరవింద్‌రావు తక్కెళ్లపల్లి తదితరులు పాల్గొన్నారు.