
Play all audios:
Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nvidia | ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా
ఎన్విడియా (Nvidia) అవతరించింది. మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేర్లు రాణిస్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 3.4 శాతం లాభపడ్డాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 3.45
ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.296.22 లక్షల కోట్లు) చేరింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ (Microsoft).. ప్రస్తుతం రెండో స్థానంలో
నిలిచింది. కృత్రిమ మేధ రంగంలో బలమైన స్థానాన్ని కొనసాగిస్తూ మార్కెట్ విలువను గణనీయంగా పెంచుకోవడంతో ఎన్విడియా ఈ ఘనత సొంతం చేసుకుంది. ఎన్విడియా ఏప్రిల్తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాల్ని
ప్రకటించింది. కంపెనీ ఆదాయం 44.1 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.78 లక్షల కోట్లుగా) నమోదైంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 12 శాతం, గతేడాది ఇదే సమయంలో నమోదైన ఆదాయంతో పోలిస్తే 69 శాతం
వృద్ధి చెందింది. వాణిజ్య ఆంక్షలు, కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఎన్విడియా మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. కేవలం చిప్ల తయారీకే పరిమితం కాకుండా ఏఐకి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా
నిర్మిస్తోంది. రానున్న నాలుగేళ్లలో సుమారు అర ట్రిలియన్ డాలర్ల విలువైన ఏఐ సూపర్ కంప్యూటర్లు, డేటా సెంటర్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. * స్టీల్, అల్యూమినియంపై టారిఫ్ 50శాతానికి
పెంపు.. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం మే నెలలో ‘స్టార్గేట్ యూఏఈ’ అనే ప్రాజెక్ట్ను ఎన్విడియా ప్రకటించింది. దీనిద్వారా అబుదాబీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లను నిర్మించనుంది. ఓపెన్ఏఐ,
ఒరాకిల్తో సహా పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ఇదిలాఉండగా.. ఎన్విడియా ప్రపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానానికి చేరడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరి 24లో
తొలిసారిగా ఆ ఘనత సొంతం చేసుకుంది. తర్వాత తన స్థానాన్ని కోల్పోయింది. ఏఐ చిప్లకు పెరుగుతున్న డిమాండ్, బలమైన ఆదాయ వృద్ధితో ఇప్పుడు మళ్లీ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.