
Play all audios:
బిహార్ అభివృద్ధి కోసం తాను పని చేస్తున్నానని.. అవకాశం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాగ్ తెలిపారు. దిల్లీ: లోక్ జన్శక్తి పార్టీ(రామ్ విలాస్)
అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు
వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరాగ్ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై విలేకరుల సమావేశంలో ఎదురైన
ప్రశ్నపై చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. ‘‘కేంద్ర రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉంటానో లేదోననే విషయం గతంలో కూడా చెప్పా. దానికి ఒక కారణం ఉంది. నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి బిహార్ ప్రజలే
కారణం. నేనేం చేసిన వారి కోసమే. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా బిహార్ను చూడాలని కోరుకుంటున్నా. మూడు సార్లు ఎంపీగా గెలిచిన తర్వాత దిల్లీలో కేంద్రమంత్రిగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడం
అసాధ్యమని గ్రహించా. * అన్నావర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో జ్ఞానశేఖరన్కు జీవిత ఖైదు! రాష్ట్రానికి మంచి జరగాలి. అవకాశం ఉంటే కచ్చితంగా పోటీ చేస్తా. కానీ, ఎన్నికల తర్వాత కూడా సీఎం
పదవిలో నీతీష్ కుమార్ ఉంటారని భావిస్తున్నా’’ అని చిరాగ్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనను అధికారికంగా ప్రకటించేందుకు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
యోచిస్తోందని.. అందుకోసం త్వరలోనే కార్యనిర్వాహక సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే స్పందించిన చిరాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన
వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.