
Play all audios:
గుజరాత్లోని బనస్కాంతలో భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చేశారు. ఇంటర్నెట్డెస్క్: భారత్లోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్కు చెందిన
ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు (BSF) కాల్చివేశాయి. శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్లోని బనస్కాంత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాయి. అధికారులు
తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దును దాటి కంచె వైపునకు వస్తున్న ఓ పాకిస్థాన్ వ్యక్తిని గుర్తించాం. వెంటనే అప్రమత్తమై అతడిని నిలువరించేందుకు ప్రయత్నించాం. కానీ, అతడు ముందుకు రావడంతో కాల్పులు
జరిపాం. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక పహల్గాం ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో భద్రతను బలగాలు కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. * పహల్గాం ఉగ్ర దాడికి ముందు పాక్కు మహమ్మద్ హరూన్..!
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ను నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని
ఉగ్రస్థావరాలను మన బలగాలు నేలమట్టం చేశాయి. దీన్ని సహించలేని పాక్ సైన్యం మనపై ఎదురుదాడికి ప్రయత్నించింది. వీటిని మన బలగాలు తిప్పికొట్టి పాక్ను చావుదెబ్బ తీశాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య
కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది.