Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ మోసం.. జీడిమెట్లలో రూ. 150 కోట్ల స్కామ్‌

feature-image

Play all audios:

Loading...

భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగు చూసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ రూ.150 కోట్ల మేర శఠగోపం పెట్టింది. జీడిమెట్ల: భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగు చూసింది.


స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ రూ.150 కోట్ల మేర శఠగోపం పెట్టింది. జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌ గణేశ్‌నగర్‌లో కొందరు వ్యక్తులు ‘ది పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌’


పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు అంటూ మదుపర్ల నుంచి దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూలు చేశారు. వీరిని నమ్మి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు బాండ్ల రూపంలో 1,500 మంది ఈ


సంస్ధలో పెట్టుబడులు పెట్టారు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున శుక్రవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు


చేపట్టారు.