Currency note: ఇండియన్ కరెన్సీ నోటు తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? షాక్ అవుతారు సుమా!

feature-image

Play all audios:

Loading...

Published by: Last Updated:November 02, 2024 3:40 PM IST ఫిజికల్‌ క్యాష్ మీద ప్రజలు ఆధారపడుతుండటం వల్ల నష్టాలు తలెత్తుతున్నాయి. ఈ కరెన్సీ నోట్లు ముద్రించడానికి RBI చాలా డబ్బులు ఖర్చు


పెట్టాల్సిన వస్తోంది. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా యూపీఐ పేమెంట్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చాక, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు చాలా పెరిగాయి. ఈ


స్థాయిలో డిజిటల్‌ పేమెంట్స్‌ జరుగుతున్నా సరే, ఇంకా అందరూ క్యాష్‌లెస్ పేమెంట్స్ వైపు షిఫ్ట్ అవ్వడం లేదు. ఇప్పటికీ చాలామంది ఫిజికల్‌ క్యాష్ వాడుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం మొత్తం రూ.34.7


లక్షల కోట్లు నగదు చెలామణిలో ఉంది. పట్టణాల్లో డిజిటల్ పేమెంట్స్ చేయడం సులభం కాబట్టి, అందరూ ఆన్‌లైన్‌ పేమెంట్లు చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు అనుసంధానమైన ప్రాంతాల్లో చాలామంది


ఇంకా క్యాష్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే క్యాష్ మీద ప్రజలు ఆధారపడుతుండటం వల్ల నష్టాలు తలెత్తుతున్నాయి. ఈ కరెన్సీ నోట్లు ముద్రించడానికి RBI చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన వస్తోంది. అసలు


ఒక్కొక్క కరెన్సీ నోటు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం. భారత్‌లో ఇప్పటికీ ప్రజలకు కరెన్సీ నోట్లతో వస్తువులు కొనుగోలు చేయడమే సులభంగా అనిపిస్తుంది. అందుకే వారు ఇంకా నగదునే


ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియా’ ప్రోగ్రాం ద్వారా డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహిస్తున్నప్పటికీ, కోట్ల మంది ప్రజల జీవితంలో నగదుకు ఉన్న ప్రాముఖ్యత తగ్గడం లేదు. advertisement ప్రింటింగ్


కాస్ట్ ఎంత? మన దేశంలో నోట్లను ముద్రించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఉదాహరణకు ఒక రూపాయి నోటును ముద్రించడానికి 96 పైసలు ఖర్చవుతుంది. అదే రూ.500 నోటును ముద్రించడానికి రూ.2.29, రూ.200 నోటును


ముద్రించడానికి రూ.2.37 ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నోట్లను ముద్రించడానికి రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. ఎల్లప్పుడూ కొత్త నోట్లు అవసరం ఉంటుంది. పాత


నోట్లు చెడిపోతాయి కాబట్టి కొత్త వాటితో భర్తీ చేయక తప్పదు. కానీ దీర్ఘకాలంలో చూస్తే, క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్‌ వల్లే తక్కువ ఖర్చు అవుతుంది. పెద్ద మొత్తంలో నగదును ముద్రించి, ప్రజలకు


అందించడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. advertisement > 🚨 Cost of Printing Currency Notes >  > • ₹10 - ₹0.96 > • ₹20 - ₹0.95 > • ₹50 - ₹1.13 > • ₹100 - ₹1.77


> • ₹200 - ₹2.37 > • ₹500 - 2.29 >  > Despite Massive Popularity of UPI, India Still Has Cash Circulation > of ₹34.7 Lakh Crore >  > — Ravisutanjani (@Ravisutanjani) 


October 30, 2024  advertisement రెండూ బ్యాలెన్స్ చేస్తున్నాయి దేశంలో క్యాష్, డిజిటల్ పేమెంట్స్ రెండింటినీ ఎలా సమతుల్యం చేయాలనే దానిపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా


కష్టపడుతున్నాయి. ప్రజలందరికీ డిజిటల్ చెల్లింపుల గురించి తెలియజేసి, వాటిని ఎక్కువగా వాడాలని ప్రోత్సహిస్తున్నాయి. అదే సమయంలో నగదు అవసరమైన ప్రాంతాల్లో క్యాష్ కూడా అందుబాటులో ఉండేలా


చూస్తున్నాయి. పేమెంట్స్‌కి సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భారతదేశ ప్రజలందరూ క్యాష్‌లెస్ పేమెంట్స్ చేయగలిగితే కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చులు ఆదా


అవుతాయి. అసలు ఈ నోట్ల అవసరమే లేకుండా పోతే బ్లాక్ మనీ, లంచాలు, ఇంకా తదితర చట్టరీత్యా వ్యతిరేకమైన లావాదేవీలు ఆగిపోతాయి. భారత్‌ని పూర్తిగా డిజిటల్‌ ఇండియాగా మార్చే లక్ష్యంతో కేంద్రం చర్యలు


తీసుకుంటోంది. Location : Hyderabad,Telangana First Published : November 02, 2024 3:40 PM IST Read More