India vs pakistan: పహల్గాం ఎఫెక్ట్.. ఆసియా కప్‌ కష్టమేనా?

feature-image

Play all audios:

Loading...

India vs Pakistan: పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను కూడా తెంచుకోవాలని ఇప్పటికే పలువురు భారత మాజీ క్రికెటర్లు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీసీసీఐ కూడా ఇదే బాటలోకి వెళ్లేలా ఉంది.


ఇంటర్నెట్ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌ కీలక పాత్ర పోషించిందనే విమర్శలు వచ్చాయి.


క్రీడా సంబంధాలపైనా ఆ ఎఫెక్ట్‌ పడనుందని.. క్రికెట్‌ సహా ఇతర క్రీడల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌లోనూ ఇరు జట్ల మధ్య సిరీస్‌లు జరగడం


లేదు. ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఈ విషయంలో ఐసీసీ కూడా దృష్టిపెట్టాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. దీంతో ఆసియా కప్‌ (Asia Cup 2025)లోనూ భారత్ పాల్గొనడంపై


ఇప్పుడు అనుమానాలు వెల్లువెత్తాయి. టోర్నీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. * ఆ జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడొచ్చు: సునీల్ గావస్కర్ ‘‘ఆసియా కప్ సాధారణంగా తటస్థ వేదిక పైనే


నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంకా షెడ్యూల్‌ను ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌ సిరీస్‌ అనంతరం సెప్టెంబర్‌లో వేదికను నిర్ణయించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆసియా కప్‌ వాయిదా పడే అవకాశం ఉంది.


ప్రస్తుతం భారత్ - పాక్‌ (India vs Pakistan)ల మధ్య ఇప్పుడు సంబంధాలు సరిగ్గా లేవు. ఇలాంటి దశలో నిర్వహించే అవకాశాలు తక్కువే’’ అని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బంగ్లా పర్యటన కూడా రద్దు! ఆగస్టులో


బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడేందుకు భారత్‌ అక్కడికి వెళ్లాల్సిఉంది. అయితే, బంగ్లా పర్యటనకూ టీమ్‌ఇండియా వెళ్లే అవకాశం తక్కువేనని సమాచారం. ‘‘ఐసీసీ క్యాలెండర్‌ ఇయర్‌లో


బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు చోటుంది. కానీ, దానిని కొనసాగించే ఛాన్స్‌లు కనిపించడం లేదు. భారత్‌కు సంబంధించిన రాష్ట్రాలపై బంగ్లా నేత చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని తెలుస్తోంది’’ అని బీసీసీఐ వర్గాలు


పేర్కొన్నాయి.