Hari hara veera mallu: పవన్‌ కల్యాణ్‌ ఒక్క సినిమానే డైరెక్ట్‌ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నం

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాకి సంబంధించి పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన టెక్నీషియన్‌ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్నారు. సాంకేతికతపై ఆయనకు మంచి పట్టుందని కొనియాడారు. ‘‘చిరంజీవి, అమితాబ్


బచ్చన్‌, రజనీకాంత్‌.. ఇలా భారతీయ సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్‌ ఉన్నారు. కమల్‌హాసన్‌, పవన్‌ కల్యాణ్‌లాంటి కొందరు నటనతోపాటు ఇతర విభాగాలపై పట్టు సాధించారు. పవన్‌ కల్యాణ్‌ ఒక్క సినిమాకే


దర్శకత్వం వహించినా.. టెక్నికల్‌ విభాగంపై ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉంది’’ అని ప్రశంసించారు. చెన్నైలో నిర్వహించిన ‘తార తార’ (హరిహర వీరమల్లు సినిమా) సాంగ్‌ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘సినిమా


పట్ల ప్యాషన్‌ ఉన్న వ్యక్తి ఏఎం రత్నం. సెట్స్‌కు ముందుగా వచ్చేది ఆయనే. చివరిగా వెళ్లేది ఆయనే. దర్శకుడు జ్యోతికృష్ణ నన్నెప్పుడూ జడ్జ్‌ చేయలేదు. నటన విషయంలో ఎంతగానో ప్రోత్సహించారు’’ అని


హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం వేదికపై డ్యాన్స్‌ చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్‌ జ్యోతికృష్ణ, కె.ఎస్‌. రవికుమార్‌, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, నటులు


నాజర్‌, సత్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. * ‘హరిహర వీరమల్లు’.. ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌ డ్యాన్స్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)ను దర్శకుడు క్రిష్‌


ప్రారంభించిన సంగతి తెలిసిందే. మిలిగిన కొంత భాగాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కించారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం, ఎ. దయాకర్‌ రావు నిర్మించారు. ఈ సినిమా తొలి భాగం తొలి భాగం ‘హరి హర


వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో జూన్‌ 12న విడుదల కానుంది. పవన్‌ కల్యాణ్‌ డైరెక్షన్‌లో ‘జాని’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంతో రూపొందిన


సినిమాలో ఆయనే హీరో.