
Play all audios:
తనను బెదిరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి గాయని కెనీషా సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఇంటర్నెట్ డెస్క్: నటుడు జయం రవి (Ravi Mohan), గాయని
కెనీషా (Kenishaa) రిలేషన్లో ఉన్నట్లు ఎంతోకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ కెనీషా ఇటీవల సోషల్
మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా అలాంటి సందేశాలు పంపుతున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు ఆమె టీమ్ తెలిపింది. కెనీషా పరువుకు భంగం కలిగించేలా సందేశాలు పంపినా, బెదిరించినా..
అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె టీమ్ పేర్కొంది. ఇన్స్టాలో వచ్చే అసభ్యకరమైన, అశ్లీల సందేశాల వల్ల ఆమె మానసికంగా కుంగిపోతున్నట్లు తెలిపింది. అలాంటి మెసేజ్లు పంపితే ఆ
స్క్రీన్షాట్లను ఆధారంగా చేసుకొని నోటీసులు పంపుతామని వెల్లడించింది. ఇలాంటి పనులు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని హెచ్చరిస్తూ పంపే నోటీసులను గాయని తన ఇన్స్టాలో షేర్ చేశారు. *
విడాకుల కేసు.. నెలకు రూ.40 లక్షల భరణం కోరిన జయం రవి భార్య తనను కొందరు వేధిస్తున్నారంటూ కెనీషా ఇటీవల సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఆ సందేశాల స్క్రీన్ షాట్లను పంచుకుంటూ.. తప్పు చేస్తే శిక్ష
అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే నిజం బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా
ఉన్నానన్నారు. అప్పటి వరకూ తనను ద్వేషించొద్దని.. ప్రశాంతంగా బతకనివ్వాలని పోస్ట్లో రాసుకొచ్చారు.