
Play all audios:
అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తినడాన్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీశ్ మహాన ఆదేశాలు జారీ చేశారు. ఒక ఎమ్మెల్యే చేసిన నిర్వాకమే అందుకు కారణం. లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ (UP Assembly)
సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఎమ్మెల్యే గుట్కా (gutkha) తిని కార్పెట్పై ఉమ్మివేయడంపై స్పీకర్ సతీశ్ మహాన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన దీని వినియోగంపై కీలక
నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తినడంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం బడ్జెట్ సమావేశం జరగడానికి ముందు
అసెంబ్లీలోకి వస్తున్న సమయంలో కార్పెట్పై గుట్కా గుర్తులను స్పీకర్ గమనించారు. ‘‘ఈ నిర్వాకం చేసిన ఎమ్మెల్యే ఎవరో నాకు తెలుసు. వీడియోలో నేనంతా చూశాను. కానీ, ఎవరినీ కించపరచాలని అనుకోవడం లేదు.
అందుకే వారి పేరును ప్రస్తావించను. ఎవరైన ఇకపై ఇలాంటి పని చేస్తున్నట్లయితే మిగిలిన సభ్యులు దాన్ని అడ్డుకోవాలని కోరుతున్నాను. అసెంబ్లీని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత. ఇలా చేసిన ఎమ్మెల్యే
వచ్చి తప్పును అంగీకరిస్తే బాగుంటుంది. లేదంటే అతడిని నేనే పిలుస్తాను’’ అని సతీశ్ మహాన హెచ్చరించారు. * నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం: విజయ్ ఇదేమీ వ్యక్తిగత ఆస్తి కాదు..
అనంతరం దగ్గరుండి కార్పెట్ను శుభ్రం చేయించారు. ఒక వ్యక్తి చేసిన పనికి మిగిలిన వారి గౌరవం ఎందుకు దెబ్బతినాలంటూ స్పీకర్ ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రజలకు చెందిందని.. ఇదేమీ వ్యక్తిగత ఆస్తి కాదంటూ
మండిపడ్డారు. అసెంబ్లీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే.. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా, పాన్ మసాలా వినియోగించడంపై ఆయన
నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 1000 జరిమానా విధించనున్నారు.