
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) విదేశాల్లో పాకిస్థాన్ చర్యలను ఎండగడుతున్నారు. ఈక్రమంలో నెదర్లాండ్స్కు చెందిన మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన
గడ్డపై జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాకిస్థాన్కు తెలియదనే భావనను మంత్రి తీవ్రంగా ఖండించారు. పాక్, ఆ దేశ ఆర్మీ రెండూ ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయన్నారు (Operation
Sindoor). ‘‘ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలోని కరడుకట్టిన ఉగ్రవాదులంతా పాకిస్థాన్లోనే ఉన్నారు. పట్టపగలే ఆ దేశంలోని పెద్దపెద్ద నగరాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు ఎక్కడ ఉంటారో
తెలుసు. వారు ఏ చర్యలకు ఒడిగడుతున్నారో తెలుసు. వారి మధ్యలో ఉన్న సంబంధాలు తెలుసు’’ అని జైశంకర్ ఘాటుగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘పాకిస్థాన్ తన ప్రమేయం లేదని
నటించకూడదు. పాక్ ప్రభుత్వం ఉగ్రసంస్థలకు సహకారం అందిస్తోంది. పాక్ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదంలో పీకల్లోతు కూరుకుపోయింది’’ అని ధ్వజమెత్తారు. ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్ అంశం భారత్కు వేర్వేరు అంశాలని
తేల్చిచెప్పారు. * ఉపాధి కోల్పోయి ‘పహల్గాం’ ఉసూరు ఇంతకుముందు కూడా మంత్రి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. పాక్ నేతలు, మరీ ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మత ఛాందసవాదంపై జైశంకర్
విమర్శలు చేశారు. ‘‘మతం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత కుటుంబసభ్యుల ముందే 26 మందిని దారుణంగా హత్య చేశారు. మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకుతెచ్చారు’’
అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని వెల్లడించారు. కాల్పుల విరమణపై భారత్-పాక్ నేరుగా చర్చలు జరిపాయన్నారు. కాల్పులు ఆగాలంటే వారు (పాక్) నేరుగా తమతో మాట్లాడాలని
అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టంచేశామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంకు దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి
పాల్పడిన సంగతి తెలిసిందే. దానికి బదులుగా ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.