Play all audios:
ఎంపీ ప్రియ సరోజ్ (సమాజ్వాదీ పార్టీ), భారత యువ క్రికెటర్ రింకు నిశ్చితార్థం త్వరలో జరగనున్నట్లు వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. జాన్పుర్ (యూపీ): సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ను
టీమ్ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ వివాహం చేసుకోబోతున్నాడు. జూన్ 8న వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. లఖ్నవూలోని ఓ లగ్జరీ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్
ఉండనున్నట్లు తెలుస్తోంది. రింకు, ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉందని గతంలో ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుపాని సరోజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. పెళ్లికి
ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లోని మచిలీషహర్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 25 ఏళ్ల ప్రియ గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదిగా
పనిచేశారు. టీమ్ఇండియాలో యువ క్రికెటర్గా రింకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.